Thursday, March 13, 2025
Thursday, March 13, 2025
HomeUncategorizedపెద్దపల్లిలో పెరుగుతున్న వలస కార్మికుల సంక్షోభం – చట్టాలున్నా అమలు శూన్యం!

పెద్దపల్లిలో పెరుగుతున్న వలస కార్మికుల సంక్షోభం – చట్టాలున్నా అమలు శూన్యం!

బతుకు దెరువు కోసం పొట్ట చేతపట్టుకుని తరలివస్తున్న కార్మికులకు కడగండ్లు మిగులుతున్నాయి. వలస కార్మికుల రక్షణకు పాలకులు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. క్షేత్ర స్థాయిలో అమలు చేయాల్సిన అధికారులు ప్రేక్షక పాత్రకే పరిమితం అవుతున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. వలస కార్మికులు ఎక్కువగా ఆధారపడే జిల్లాల్లో పెద్దపల్లి ఒకటి. పారిశ్రామికంగా గుర్తింపు పొందిన ఈ జిల్లాలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఈ జిల్లాపై ఆధారపడుతుంటారు. ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, సింగరేణి, పారా బాయిల్డ్ రైస్ మిల్లులు, ఇటుక బట్టీలు, పెట్రోలియం స్టాక్ పాయింట్స్ వంటివి ఈ జిల్లాలో ఏర్పాటయ్యాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాలను మినహాయిస్తే పెద్దపల్లి జిల్లాలనే తెలంగాణలో మొదటి వరసలో నిలుస్తుంది. దీంతో ఇక్కడ ఉపాధి అవకాశాలు ఉంటాయని భావించిన నిరుపేదల వలస వస్తుంటారు. జిల్లా వ్యాప్తంగా కూడా సుమారు 70 వేల వరకు వలస కార్మికులు ఉండవచ్చని అంచనా.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments